Thursday, May 2, 2019

మోదీని హిట్ల‌ర్‌తో పోల్చిన వ‌ర్మ‌

మోదీని హిట్ల‌ర్‌తో పోల్చిన వ‌ర్మ‌
Updated : 02-May-2019 : 10:56

వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మకు సినిమాల ద్వారానో.. లేక త‌న ట్విట్ట‌ర్‌లో ఎవ‌రినో ఒక‌రిని తిడుతూనో వార్త‌ల్లో ఉండ‌టం అల‌వాటే. రీసెంట్‌గా `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` సినిమా ద్వారా వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచాడు. ఆంధ‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉన్నంత వ‌ర‌కు `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`ను విడుద‌ల చేయ‌వ‌ద్ద‌ని కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ సూచించింది. దీంతో వ‌ర్మకు అప్ప‌టి వ‌ర‌కు ఏం చేయాలో తెలియ‌లేదో ఏమో కానీ.. నిన్న‌టి వ‌ర‌కు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుని దుయ్య‌బ‌డుతూ వ‌చ్చాడు. ఈరోజు స‌డెన్‌గా రూట్ మార్చాడు.

ఏకంగా దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని టార్గెట్ చేశాడు. రెండో ప్ర‌పంచ యుద్ధానికి కార‌ణ‌మైన జ‌ర్మ‌నీ అధినేత అడాల్ఫ్ హిట్ల‌ర్‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని పోల్చాడు వ‌ర్మ‌. అప్ప‌ట్లో హిట్ల‌ర్ ఓ చిన్న‌పాప‌తో తీసుకున్న ఫోటోని.. ప్ర‌ధాని మోదీ ఓ విదేశీ యాత్రలో చిన్నారితో తీసుకున్న ఫోటోతో పోల్చుతూ పోస్ట్ చేశారు. `సేమ్ టు సేమ్‌` అంటూ కామెంట్ కూడా చేశారు రాంగోపాల్ వ‌ర్మ‌. మ‌రి దీనిపై బిజెపి పార్టీ నుండి కానీ.. ప్ర‌ధాని కార్యాల‌యం నుండి కానీ ఏమైనా రిప్లై వ‌స్తుందేమో చూద్దాం.




No comments:

Post a Comment